తెలంగాణ: వచ్చే నెల ఉద్యోగ విరమణ చేయనున్న సీఎస్ శాంతికుమారి!
- March 14, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శిగా ఉన్న శాంతికుమారి వచ్చే నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తన కసరత్తు ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
తనకు సన్నిహితంగా ఉండే మంత్రులతో పలు దఫాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక పై సీఎం రేవంత్ సమాలోచనలు జరిపినట్టు తెలుస్తొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్ ఐఏఎస్లు అరవింద్ కుమార్, శశాంక్ గోయల్, రామకృష్ణారావు, జయేష్ రంజన్, వికాస్రాజ్ తదితరులకు అవకాశం ఉన్నా సీఎం రేవంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిని రేపుతోంది.
వచ్చే మూడున్నరేళ్లు కీలకంగా భావిస్తున్న సీఎం రేవంత్ తనతో పోటీ పడి పనిచేసేవారినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







