షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- March 15, 2025
మనామా: రెండు వారాల క్రితం షఖురా ప్రాంతంలో విషాదకరంగా మరణించిన బాధితుడి కుటుంబం, పార్కింగ్ వివాదం కారణంగానే హత్య జరిగిందని సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లను తీవ్రంగా ఖండించింది. బాధితురాలు గతంలో అనేక వేధింపులు, దాడులకు గురయ్యిందని, అవన్నీ నిందితుల వల్లనే జరిగాయని కుటుంబం వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో తమ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కేసుపై దృష్టి సారించినందుకు అంతర్గత మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, హత్యకు సంబంధించి 47 ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తెలిపింది. ఉత్తర గవర్నరేట్లోని షఖురా ప్రాంతంలోని నివాస భవనంలోని పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందిన కొద్దిసేపటికే నిందితుడిని అరెస్టు చేశారు. చట్టపరమైన విధానాలు పాటించామని, తదుపరి చర్య కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







