షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- March 15, 2025
మనామా: రెండు వారాల క్రితం షఖురా ప్రాంతంలో విషాదకరంగా మరణించిన బాధితుడి కుటుంబం, పార్కింగ్ వివాదం కారణంగానే హత్య జరిగిందని సోషల్ మీడియాలో వైరలవుతున్న పుకార్లను తీవ్రంగా ఖండించింది. బాధితురాలు గతంలో అనేక వేధింపులు, దాడులకు గురయ్యిందని, అవన్నీ నిందితుల వల్లనే జరిగాయని కుటుంబం వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో తమ సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కేసుపై దృష్టి సారించినందుకు అంతర్గత మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, హత్యకు సంబంధించి 47 ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తెలిపింది. ఉత్తర గవర్నరేట్లోని షఖురా ప్రాంతంలోని నివాస భవనంలోని పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందిన కొద్దిసేపటికే నిందితుడిని అరెస్టు చేశారు. చట్టపరమైన విధానాలు పాటించామని, తదుపరి చర్య కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచించినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







