ఉచితం'పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- July 05, 2016
హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు గాను దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత మంత్రాన్ని పఠిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కోసం ప్రజల కోసం ఆయా పార్టీలు ఉచితంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టడం మనం చూశాం.అయితే ఈ 'ఉచితం'పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచితానికి మంగళం పాడి, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా పారిశ్రామికవేత్తలు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు.వివరాల్లోకి వెళితే... సోమవారం హైదరాబాదులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టాప్సీ) శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎఫ్టాప్సీ వంద సంవత్సరాల లోగో, మార్పులు చేసిన వెబ్సైటును, ప్రచార కార్యక్రమానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ఆయన విడుదల చేశారు.
ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్టాప్సీ శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించడం తనకెంతో గర్వకారణంగా ఉందని, ఎఫ్టాప్సీ ప్రయాణంలో పాలుపంచుకున్న వారందరికీ ఇది మరిచిపోలేని రోజని గవర్నర్ పేర్కొన్నారు. పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ను ప్రధానంగా ప్రస్తావించారు.
ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
పారిశ్రామికవేత్తలు పల్లె సీమలను పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు పాటు పడాలని ఆయన సూచించారు. తమ సీఎస్ఆర్ నిధులను పట్టణాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. వీటిలో సామర్థ్యాలు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ కోరారు.
ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
''సామాజికంగా వివిధ వర్గాలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలుంటాయి. వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. సంపాదించే శక్తినీ ఇవ్వాలి. దాంతో వారు ఆత్మ గౌరవంతో జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఉచిత పథకాలను తప్పనిసరిగా రద్దు చేయాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
ఈ కార్యక్రమంలో ఎఫ్టాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, శతాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ అనిల్ రెడ్డి వెన్నం తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







