ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా
- July 05, 2016
వచ్చే ఐదేళ్లలో భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా జరగనుంది. యూఎస్ అధ్యయన సంస్థ ప్రకారం.. ఐటీ పరిశ్రమలో ఆటోమిషన్ను అమలు చేయడం ద్వారా ఈ సెక్టార్లో పనిచేస్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు సర్వే వెల్లడించింది. వీరి సంఖ్య 6.4 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా నాస్కామ్ అభిప్రాయం ప్రకారం... ఆటోమిషన్ కానీ రోబోటిక్స్ వినియోగం కానీ ఐటీ పరిశ్రమను ఎలా లీడ్ చేస్తదో ఎవరికీ తెలియదు. ఆటోమిషన్ రాకవల్ల కొంత ప్రభావం పడనుంది. కానీ కొత్త టెక్నాలజీ వినియోగం వల్ల నూతన ఉద్యోగాల కల్పన సైతం జరుగుతదని పేర్కొంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్పేస్లో అదేవిధంగా బీపీవో రంగంలో ఆటోమిషన్ వల్ల తీవ్ర ప్రభావం పడనుంది. ఆటోమిషన్ వినియోగం వల్ల ఒకవైపు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు 30శాతం పడిపోనుండగా మరోవైపు మీడియం స్కిల్డ్ ఉద్యోగాలు 8 శాతం, అదేవిధంగా హై స్కిల్డ్ ఉద్యోగాలు 56 శాతం పెరగనున్నట్లు ఐటీ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









