ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా
- July 05, 2016
వచ్చే ఐదేళ్లలో భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల తెగ్గోత భారీగా జరగనుంది. యూఎస్ అధ్యయన సంస్థ ప్రకారం.. ఐటీ పరిశ్రమలో ఆటోమిషన్ను అమలు చేయడం ద్వారా ఈ సెక్టార్లో పనిచేస్తున్న తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు సర్వే వెల్లడించింది. వీరి సంఖ్య 6.4 లక్షలుగా ఉండనున్నట్లు సమాచారం. కాగా నాస్కామ్ అభిప్రాయం ప్రకారం... ఆటోమిషన్ కానీ రోబోటిక్స్ వినియోగం కానీ ఐటీ పరిశ్రమను ఎలా లీడ్ చేస్తదో ఎవరికీ తెలియదు. ఆటోమిషన్ రాకవల్ల కొంత ప్రభావం పడనుంది. కానీ కొత్త టెక్నాలజీ వినియోగం వల్ల నూతన ఉద్యోగాల కల్పన సైతం జరుగుతదని పేర్కొంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్పేస్లో అదేవిధంగా బీపీవో రంగంలో ఆటోమిషన్ వల్ల తీవ్ర ప్రభావం పడనుంది. ఆటోమిషన్ వినియోగం వల్ల ఒకవైపు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు 30శాతం పడిపోనుండగా మరోవైపు మీడియం స్కిల్డ్ ఉద్యోగాలు 8 శాతం, అదేవిధంగా హై స్కిల్డ్ ఉద్యోగాలు 56 శాతం పెరగనున్నట్లు ఐటీ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







