ప్రధాని సంతాపం...
- January 22, 2017న్యూదిల్లీ: విజయనగరం జిల్లాలో శనివారం అర్థరాత్రి జరిగిన రైలు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద హీరాఖండ్ ఎక్స్ప్రెస్ శనివారం రాత్రి పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 32మందికి పైగా మృతిచెందారు. దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ.. ఇది విషాదకర ఘటన అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన వారందరికి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సంతాపం ప్రకటించారు. ‘ఈ ఘటన చాలా విచారకరం.. బాధాకరం.. విలువైన ప్రాణాలను కోల్పోయాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు