కొలంబియాలో బోట్ మునిగి 9మంది మృతి
- June 25, 2017కొలంబియా: కొలంబియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ టూరిస్ట్ బోట్ మునిగి తొమ్మిది మంది మృతి చెందగా, మరో 30మందికి పైగా గల్లంతు అయ్యారు. బోట్లో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిటిష్ కొలంబియా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న చిన్న బోట్లు మరో పెద్ద బోటు త్వరితగతిన ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని 100మందికి పైగా సురక్షితంగా రక్షించారు. దాదాపు 20 మందికి పైగా బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మెడెల్లిన్ కు 45 కిలోమీటర్ల దూరంలో తూర్పుగా ఉన్న గుటాపె సమీపంలోని కోస్తా తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెస్క్యూ టీమ్తో పాటు, కొలంబియన్ వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను చేపట్టి బాధితులను అక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే బోట్లో ఎలాంటి లైఫ్ జాకెట్లు లేవని, బోటు ఐదు నిమిషాల వ్యవధిలోనే మునిగిపోయిందని ప్రాణాలతో బయటపడ్డ ఓ టూరిస్ట్ తెలిపాడు. కాగా ప్రమాదానికి ముందు బోట్ ఒక భాగం నీటిలో మునిగిపోయినట్లు సోషల్మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత