మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- April 30, 2024
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా పూర్తిగా మార్పులు చేసింది. యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించే క్రమంలో పలు మార్పులు చేసింది. ఇందులో ప్రధానంగా చేసిన మార్పు థీమ్ కలర్.
వాట్సాప్లో అంతకుముందు ‘నీలం’ రంగులో ఉండేది అయితే ప్రస్తుతం దీనిని గ్రీన్ కలర్లోకి మార్చారు. దాదాపు అందరూ యూజర్లకు ఈ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది. అయితే ఈ మార్పుపై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఇదిలా ఉంటే వాట్సాప్లో థీమ్ కలర్ మార్చడం వెనకాల ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూజర్లు యాప్ను మరింత సౌలభ్యంగా ఉపయోగించడంతో పాటు సరికొత్త అనుభవం ఇవ్వడం కోసమే తాము థీమ్ కలర్ని ‘గ్రీన్’గా మార్చినట్టు మెటా సంస్థ పేర్కొంది. అదొక్కటే కాదు.. లుక్ కూడా కాస్త మార్చామని, స్పేసింగ్తో పాటు ఐకాన్స్లోనూ కొద్దిపాటు మార్పులు చేశామని సంస్థ తెలిపింది.
అదే విధంగా స్టేటస్ బార్ దగ్గర నుంచి చాట్-లిస్ట్ విండో దాకా.. డిజైన్ పరంగా దాదాపు యూజర్ ఇంటర్ఫేజ్ను మొత్తం మార్చేసింది వాట్సాప్. ఇక డార్క్ మోడ్ అయితే మరింత ముదురు రంగులోకి మార్చారు.
వీటితో పాటు వాట్సాప్లో ఫిల్టర్ ఫీచర్ను తీసుకొచ్చింది. ఇందులో ఆల్, అన్రీడ్, గ్రూప్స్ అనే మూడు కేటగిరీల్లో మెసేజ్లను చూసుకునే వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు స్టేటస్ను నేరుగా ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని అందించారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









