సౌదీ అరేబియాలో ముగిసిన క్షమాభిక్ష గడువు
- June 25, 2017సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్ష గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. తెలంగాణకు చెందిన మూడు వేల మంది క్షమా భిక్షకు దరఖాస్తు చేసుకోగా ..మరో మూడు వేల మంది అక్కడే తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారు అక్కడ ఉండలేరు..ఇండియాకు రాలేరు. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు.రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష సౌదీ రియాల్స్ జరిమానా విధించే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోని తెలంగాణ కార్మికులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఆశ్రయం ఇచ్చేవారే కరువయ్యారు. సౌదీలో వేతనాలు ఎక్కువగా ఉంటాయన్న భావనతో తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉపాధి వెతుక్కుంటూ సౌదీ వెళుతున్నారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్