రైలు ఏసీ-1, ఏసీ -2 టికెట్ కన్ఫమ్ కాకపోతే విమానంలో వెళ్లే అవకాశం...
- October 23, 2017రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ-1, ఏసీ -2 వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫమ్ కాకపోతే ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణికులను విమానంలో పంపించాలని యోచిస్తున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహాని వెల్లడించారు. రాజధాని రైళ్లలో ప్రయాణికుల రద్దీ వల్ల ఏసీ -2 టికెట్లు కన్ ఫమ్ కావడం లేదని అలాంటి వారిని విమానాల్లో పంపించి విమానాల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చూస్తామని అశ్వనీ పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్టులో ఉండి కన్ ఫమ్ కాని రాజధాని ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల వివరాలు ఎయిర్ ఇండియాకు పంపిస్తామని వారు ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే వారిని వారి గమ్యస్థానాల్లో దింపేలా చూస్తామన్నారు. ఈ ప్రతిపాదనను ఎయిర్ ఇండియాకు పంపించామని రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు. రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ చేసిన ప్రతిపాదనపై తాను ఇప్పుడే మాట్లాడనని, ఎందుకంటే రైల్వేకు, విమాన చార్జీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఎయిర్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ బన్సాల్ చెప్పారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన