మనామా:పేలుడు కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
- April 20, 2018మనామా:హై క్రిమినల్ కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. బుడైయా హైవేపై ఓ పేలుడుకి సంబంధించిన కేసులో ఈ ముగ్గురూ దోషులుగా తేలారు. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చిందని చెప్పారు. హత్యకు యత్నించడం, పేలుడు పదార్థాల్ని వినియోగించేందుకు శిక్షణ పొందడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం, ఉపయోగించడం, విధ్వంసాలకు పాల్పడటం వంటి అభియోగాలు వీరిపై నిరూపించబడ్డాయి. నిందితుల్లో ఇద్దరి పౌరసత్వాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. అల్ కాదమ్ ట్రాఫిక్ లైట్ వద్ద బాంబుని వుంచి, పేల్చారు నిందితులు. అబు సైబా వద్ద బుడైయా హైవేపై ఈ పేలుడు చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా