భారత్ × ఆస్ట్రేలియా: షెడ్యూల్ విడుదల
- April 30, 2018మెల్బోర్న్: ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్లు ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా 2018-19కి సంబంధించి ఆసీస్ ఆడే క్రికెట్ మ్యాచ్ల వివరాలను వెల్లడించింది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆసీస్ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్తో భారత్ తన పర్యటనను ప్రారంభించనుంది.
షెడ్యూల్:
మొదటి టీ20: నవంబరు 21- గబ్బా
రెండో టీ20: నవంబరు 23- మెల్బోర్న్
మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ
మొదటి టెస్టు: డిసెంబరు 6 - ఆడిలైట్
రెండో టెస్టు: డిసెంబరు 14 - పెర్త్
మూడో టెస్టు: డిసెంబరు 26 - మెల్బోర్న్(బాక్సింగ్ డే టెస్టు)
నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ
మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ
రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్
మూడో వన్డే: జనవరి 18- మెల్బోర్న్
ఈ మూడు సిరీస్ల్లో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్ ఆడలేరు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్కు దూరం కానున్నారు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్క్రాఫ్ట్ భారత్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం