కాబూల్లో జంట పేలుళ్లు.. 21 మంది మృతి
- April 30, 2018కాబూల్: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరం నెత్తురోడింది. ఉదయం షష్టారక్ ప్రాంతంలో జరిగిన ఓ పేలుడులో ఐదుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పాత్రికేయులు గుమిగూడి ఉన్నసమయంలో ఓ వ్యక్తి వారితో కలిసి పోయి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 21 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెందిన ఫోటోగ్రాఫర్ షా మరై మృతిచెందారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఈ పేలుళ్లకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు..విధ్వంసానికి ISI భారీ కుట్ర!
- ఏపికి కొత్త ఐపీఎస్లు..కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!
- 'మడా' కార్డులతో 22% పెరిగిన ఈ-కామర్స్..!
- ఒమానీ-బహ్రెయిన్ ప్రదర్శన..సలాలాలో ఆకట్టుకుంటున్న 4వ ఎడిషన్
- సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!
- 'పారిస్ 2024' ఒలింపిక్స్.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న అమీర్
- యూఏఈ లో జెట్ స్కీ ప్రమాదం.. ఓ వ్యక్తిని రక్షించిన కోస్ట్ గార్డ్
- దుబాయ్ లో రోడ్ స్టంట్స్.. 50,000 దిర్హామ్లు జరిమానా
- జనతా క్యాంటీన్ల పై ఈవో ప్రత్యేక దృష్టి
- సినారె 93వ జయంతికి సీఎం రేవంత్ కి ఆహ్వానం