కాబూల్లో జంట పేలుళ్లు.. 21 మంది మృతి
- April 30, 2018
కాబూల్: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరం నెత్తురోడింది. ఉదయం షష్టారక్ ప్రాంతంలో జరిగిన ఓ పేలుడులో ఐదుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పాత్రికేయులు గుమిగూడి ఉన్నసమయంలో ఓ వ్యక్తి వారితో కలిసి పోయి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 21 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెందిన ఫోటోగ్రాఫర్ షా మరై మృతిచెందారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఈ పేలుళ్లకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్