కాబూల్లో జంట పేలుళ్లు.. 21 మంది మృతి
- April 30, 2018
కాబూల్: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ నగరం నెత్తురోడింది. ఉదయం షష్టారక్ ప్రాంతంలో జరిగిన ఓ పేలుడులో ఐదుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పాత్రికేయులు గుమిగూడి ఉన్నసమయంలో ఓ వ్యక్తి వారితో కలిసి పోయి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 21 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెందిన ఫోటోగ్రాఫర్ షా మరై మృతిచెందారు. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఈ పేలుళ్లకు సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు