మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- May 05, 2024
మస్కట్: మార్చి నెలలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల జాబితాలో భారత జాతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. వచ్చిన భారతీయుల సంఖ్య 79,810, బయలు దేరిన వారి సంఖ్య 77,646 గా ఉంది. ఆ తర్వత బంగ్లాదేశ్ పౌరులు 14,469 మంది రాగా 20,909 మంది బయలుదేరారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం 24,097 మంది రాకపోకలు మరియు 20,191 మంది నిష్క్రమణలతో పాకిస్తాన్ జాతీయులు మూడవ స్థానంలో నిలిచారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య మార్చి 2024 చివరి నాటికి 16.8 శాతం పెరిగి 3,840,354 మంది ప్రయాణికులకు చేరుకుంది. ఈ సంఖ్య మార్చి 2023 చివరినాటికి 3,287,015 మంది ప్రయాణికులుగా ఉన్నది. అదే సమయంలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 17.7 శాతం పెరిగి 3,482,325కి చేరుకుందని ఎన్సిఎస్ఐ విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







