ఇండియన్ బ్యాంకర్ యు.ఏ.ఈలో మృతి
- July 17, 2018యు.ఏ.ఈ:వారం రోజులుగా కన్పించకుండా పోయిన బ్యాంక్ ఉద్యోగి మృతదేహం వెలుగు చూసింది. గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో ఈ మృతదేహాన్ని భద్రపరచగా, సోషల్ వర్కర్స్, కమ్యూనిటీ గ్రూప్స్ మృతుడెవరన్నదాన్ని గుర్తించేందుకు ప్రయత్నించడం జరిగింది. కాగా, సోమవారం మధ్యాహ్నం మృతుడి సోదరుడు, తన సోదరుడి మృతదేహాన్ని గుర్తించడంతో అతని వివరాలు వెలుగు చూశాయి. అబుదబీలో భారతీయ వలసదారుడు జబర్ నివసిస్తున్నారు. ముస్సాఫ్పా ఇండస్ట్రియల్ ఏరియాలో అతని మృతదేహం కనుగొన్నారు. మృతుడు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. తొమ్మిదేళ్ళుగా అబుదాబీలో నివాసముంటున్నాడీయన. ఎవరితోనూ తన సోదరుడికి గొడవలు లేవనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని మృతుడి సోదరుడు మునీర్ చెప్పారు. మునీర్ కూడా, తన సోదరుడితోనే కలిసి అదే బ్యాంక్లో పనిచేస్తున్నాడు. మృతుడు జబార్కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతికి గల కారణాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో తెలుసుకోనున్నారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి