ఉగ్రవాద సంస్థల ఖాతాలు బ్లాక్ చేయనున్న ఫేస్బుక్
- July 17, 2018పాకిస్తాన్లో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్ జూకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను ప్రోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 25 నుంచి పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దు చేయాలని పాక్ ఎన్నికల కమిషన్ ఇటీవల జూకర్బర్గ్ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్ ఎకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫేస్బుక్ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్ సయ్యద్ స్థాపించిన జమత్-ఉద్-దావా, ఇస్లామిక్ మల్లీ ముస్లిం లీగ్ (ఎమ్ఎమ్ఎల్) సంస్థలు ఉన్నాయని ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తామని జూకర్బర్గ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్