అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు
- November 12, 2018షార్జాలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. షార్జా మే సెలూన్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే షార్జా సివిల్ డిఫెన్స్, సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్నీ, రెస్క్యూ యూనిట్స్నీ పంపించడం జరిగింది. కేవలం ఐదు నిమిషాల్లోనూ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డ ఆసియా మహిళ, ఆమె చిన్నారికి వెంటనే వైద్య సహాయం అందించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. సమాన్ అలాగే అల్ మినా నుంచి కూడా ఫైర్ ఫైటర్స్, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ఇంట్లో 30 మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్