ఆంటీ అంటూ నన్ను ఎవరైనా పిలిస్తే…షూట్ చేయండి: స్మ్రుతి ఇరానీ
- December 28, 2018ప్రస్తుత కాలంలో చాలామంది యువతులకైనా, యువకులకైనా ఎంత వయసు పెరిగినా కూడా ఆంటీ, అంకుల్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తనకు కూడా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టముండదు అంటూ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఎయిర్ పోర్టులో అనుకోకుండా స్మృతి ఇరానీ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిశారట. దీంతో ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారట. 'జాన్వీ కపూర్ నన్ను ఆంటీ అని సంబోధిస్తూ మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నాక ఆంటీ అని పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేనేం ఫర్వాలేదు అంటూ సర్ది చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే… ఆంటీ అంటూ ఎవరైనా పిలిస్తే… ఎవరైనా నన్ను షూట్ చేయండి అని గట్టిగా అరవాలన్పిస్తుంది…' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు స్మృతీ ఇరానీ. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం