దుబాయ్ లో వైఎస్సార్సీపీ విజయోత్సవాలు
- May 26, 2019దుబాయ్:ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దుబాయ్ లోని సోనాపూర్ బ్లూ డైమండ్ వర్కర్స్ క్యాంపు లో సంబరాలు నిర్వహించారు.యూ.ఏ.ఈ లో ఉన్న వైకాపా కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచుతూ.. నృత్యాలు చేస్తూ..సంబరాల్లో పాల్గొన్నారు.ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ స్థానాలు రావడంతో పార్టీ కేడర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.వైఎస్సార్సీపీ యూ.ఏ.ఈ NRI సెల్ తరపున రమేష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు పార్టీ MLA,MP లకు శుభాకాంక్షలు తెలిపారు.రమేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్ మరియు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ గురించి వివరించారు.
పవిత్ర రమదాన్ సంధర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి,సోమిరెడ్డి,కుమార్ చంద్ర,అక్రమ్,బ్రహ్మానంద రెడ్డి,రెడ్డయ్య,సుధాకర్ రావు,రమణ,దిలీప్,కోటేశ్వర్ రెడ్డి,జగదీశ్,హరీష్ ప్రభాకర్,నసీర్,శివానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన