నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం..50 మందికి పైగా మృతి
- March 17, 2025
నార్త్ మెసిడోనియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. నైట్ క్లబ్లో సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 59 మంది సజీవదహనమయ్యారు. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొకాని పట్టణంలోని పల్స్ నైట్ క్లబ్లో స్థానిక పాప్ బృందం కన్సర్ట్ నిర్వహిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ కార్యక్రమంలో బాణాసంచా కాల్చడంతో పైకప్పునకు మంటలు అంటుకున్నాయి. దీన్ని గమనించిన పాప్ బృందం వెంటనే అక్కడ నుంచి అందరూ వెళ్లిపోవాలని కోరింది.
దీంతో ఏం జరిగిందో అర్ధంకాక గందరగోళం మధ్యే యువతీయువకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ లోపే దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది యువతీ యువకులే. మరణించిన వారిలో ఇప్పటివరకు 39 మందిని గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మెసిడోనియా ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఇది మెసిడోనియాకు విచారకరమని, చాలా మంది యువతీ యువకులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశానికి పూడ్చలేని నష్టంగా ఆయన అభివర్ణించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







