యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవు తేదీలు ఇవే..!!
- March 18, 2025
యూఏఈ: ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సోమవారం ఈద్ అల్ ఫితర్ సెలవు తేదీలను యూఏఈ ప్రకటించింది. ఈ సెలవుదినం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ 1న ప్రారంభమై షవ్వాల్ 3, 1446 హిజ్రీతో ముగుస్తుందని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ తెలిపింది. షవ్వాల్ 4న అధికారిక పని తిరిగి ప్రారంభం కానుంది.
పవిత్ర రమదాన్ మాసం 30 రోజులు పూర్తి చేసుకుంటే, రమదాన్ 30 (ఆదివారం, మార్చి 30) ఈద్ అల్ ఫితర్ అధికారిక సెలవుదినం అవుతుంది. యూఏఈలో చంద్రుని దర్శనం మార్చి 29న జరుగుతుంది. ఇస్లామిక్ నెలలు 29 లేదా 30 రోజులు ఉంటాయి. పవిత్ర రమదాన్ మాసం ముగింపును సూచిస్తూ షవ్వాల్ 1న ఈద్ జరుపుకుంటారు. మార్చి 29న నెలవంక కనిపిస్తే, జార్జియన్ క్యాలెండర్ ప్రకారం ఈద్ అల్ ఫితర్ మార్చి 30న(ఆదివారం) ఉంటుంది. దీని ప్రకారం ఏప్రిల్ 1 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవు మూడు రోజులు ఉంటుంది. దీని ఫలితంగా మార్చి 29 నుండి ఏప్రిల్ 1 వరకు నాలుగు రోజుల సెలవు ఉంటుంది. మార్చి 29న చంద్రుడు కనిపించకపోతే.. రమదాన్ 30 రోజులు ఉంటే, షవ్వాల్ మొదటి రోజు మార్చి 31న(సోమవారం) వస్తుంది. దీని ప్రకారం మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు మూడు రోజుల ఈద్ సెలవు ఉంటుంది.
ఈ సందర్భంలోనివాసితులకు మార్చి 29 నుండి ఏప్రిల్ 2 వరకు ఐదు రోజుల సుదీర్ఘ వారాంతం లభిస్తుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈద్ అల్ ఫితర్ కోసం ఆరు రోజుల వరకు సెలవు పొందుతారు. ఎందుకంటే శుక్రవారం షార్జాలోని ప్రభుత్వ రంగ కార్మికులకు వీకెండ్. ఈద్ మార్చి 30న( ఆదివారం) వస్తే, షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 1 (మంగళవారం) వరకు ఐదు రోజుల సెలవు లభిస్తుంది. మార్చి 31న (సోమవారం) ఈ పండుగ ప్రారంభమైతే, ఈ ఉద్యోగులకు మార్చి 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 2 (బుధవారం) వరకు ఆరు రోజుల సుదీర్ఘ వారాంతపు సెలవులు లభిస్తాయి.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









