ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నం

- July 05, 2016 , by Maagulf
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నం

 ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నాన్ని మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో నంబర్‌ టెర్మినల్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లోని ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌(కెవిఐసీ) బృందం దీన్ని తయారు చేశారు. నాలుగు టన్నుల బరువు ఉండే ఈ రాట్నాన్ని తయారు చేసేందుకు అధిక నాణ్యమైన టేకును ఉపయోగించారు. 26 మంది వడ్రంగులు 40 రోజుల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. ఈ రాట్నం తొమ్మిది మీటర్ల పొడవు ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కల్‌రాజ్‌ మిశ్రా, మహేశ్‌ శర్మ, ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరయ్యారు. ప్రదర్శనకు ఉంచిన ఈ రాట్నాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com