ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నం
- July 05, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నాన్ని మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో నంబర్ టెర్మినల్లో దీన్ని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కెవిఐసీ) బృందం దీన్ని తయారు చేశారు. నాలుగు టన్నుల బరువు ఉండే ఈ రాట్నాన్ని తయారు చేసేందుకు అధిక నాణ్యమైన టేకును ఉపయోగించారు. 26 మంది వడ్రంగులు 40 రోజుల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. ఈ రాట్నం తొమ్మిది మీటర్ల పొడవు ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కల్రాజ్ మిశ్రా, మహేశ్ శర్మ, ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ప్రదర్శనకు ఉంచిన ఈ రాట్నాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









