ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నం
- July 05, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద చెక్క రాట్నాన్ని మంగళవారం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో నంబర్ టెర్మినల్లో దీన్ని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లోని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కెవిఐసీ) బృందం దీన్ని తయారు చేశారు. నాలుగు టన్నుల బరువు ఉండే ఈ రాట్నాన్ని తయారు చేసేందుకు అధిక నాణ్యమైన టేకును ఉపయోగించారు. 26 మంది వడ్రంగులు 40 రోజుల పాటు కష్టపడి దీన్ని రూపొందించారు. ఈ రాట్నం తొమ్మిది మీటర్ల పొడవు ఐదు మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కల్రాజ్ మిశ్రా, మహేశ్ శర్మ, ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ప్రదర్శనకు ఉంచిన ఈ రాట్నాన్ని సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









