ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!

- July 22, 2026 , by Maagulf
ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!

రియాద్:ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రపంచ ఇంధన భద్రతను పటిష్ఠం చేయడంపై సౌదీ అరేబియా, భారత్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. సౌదీ ఇంధన మంత్రి, పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ రియాద్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సౌదీ సహాయ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్ ముసాయిద్ అల్-ఐబాన్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించిన అధికారులు, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే మార్గాలపై చర్చించారు. అలాగే ప్రపంచ ఇంధన భద్రతకు తోడ్పడటం, స్థిరమైన ఇంధన సరఫరాలను నిర్ధారించేందుకు ఉమ్మడిగా చేపట్టాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com