చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- March 20, 2025
లండన్: మెగాస్టార్ చిరంజీవికి నిన్న హౌస్ ఆఫ్ కామన్స్–యు.కె పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరిగింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను యుకెకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా, పలువురు యూకే పార్లమెంట్ సభ్యులు చిరంజీవిని సన్మానించారు. ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు.
దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పద్మశ్రీ, పద్మ విభూషణ్, డాక్టరేట్, గిన్నిస్ బుక్ రికార్డ్.. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు యూకే పార్లమెంట్ లో లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు అందుకోవడంతో మరో ఘనత సాధించారు చిరంజీవి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







