ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన దుబాయ్..!!
- March 21, 2025
దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను దుబాయ్ ప్రకటించింది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి షవ్వాల్ 1 నుండి షవ్వాల్ 3, 1446 AH వరకు సెలవు ఉంటుందని తెలిపింది. అధికారిక పనులు షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం తెలిపింది.
అంతకుముందు, షార్జా కూడా ఈద్ అల్ ఫితర్ సెలవు తేదీలను ప్రకటించింది. ఇవి షవ్వాల్ 1 నుండి ప్రారంభమై షవ్వాల్ 3, 1446 AH వరకు కొనసాగుతాయని షార్జా ప్రభుత్వ మానవ వనరుల శాఖ తెలిపింది. షిఫ్ట్లలో పనిచేసే ఉద్యోగులు తప్ప, ప్రభుత్వ రంగానికి అధికారిక పనులు షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.
చంద్రుని దర్శనాన్ని బట్టి, ఈద్ అల్ ఫితర్ మార్చి 30 ఆదివారం వస్తే, షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 1 (మంగళవారం) వరకు ఐదు రోజుల సెలవు లభిస్తుంది. మార్చి 31 (సోమవారం) పండుగ ప్రారంభమైతే, ఈ ఉద్యోగులకు మార్చి 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 2 (బుధవారం) వరకు ఆరు రోజుల సుదీర్ఘ వారాంతపు సెలవు లభిస్తుంది.
మరోవైపు యూఏఈలోచంద్రుని దర్శనం మార్చి 29న జరుగుతుంది. ఇస్లామిక్ నెలలు 29 లేదా 30 రోజులు ఉంటాయి. పవిత్ర రమదాన్ మాసం ముగింపును సూచిస్తూ షావాల్ 1న ఈద్ జరుపుకుంటారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







