ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన దుబాయ్..!!
- March 21, 2025
దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను దుబాయ్ ప్రకటించింది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి షవ్వాల్ 1 నుండి షవ్వాల్ 3, 1446 AH వరకు సెలవు ఉంటుందని తెలిపింది. అధికారిక పనులు షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం తెలిపింది.
అంతకుముందు, షార్జా కూడా ఈద్ అల్ ఫితర్ సెలవు తేదీలను ప్రకటించింది. ఇవి షవ్వాల్ 1 నుండి ప్రారంభమై షవ్వాల్ 3, 1446 AH వరకు కొనసాగుతాయని షార్జా ప్రభుత్వ మానవ వనరుల శాఖ తెలిపింది. షిఫ్ట్లలో పనిచేసే ఉద్యోగులు తప్ప, ప్రభుత్వ రంగానికి అధికారిక పనులు షవ్వాల్ 4, 1446 AH న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది.
చంద్రుని దర్శనాన్ని బట్టి, ఈద్ అల్ ఫితర్ మార్చి 30 ఆదివారం వస్తే, షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 1 (మంగళవారం) వరకు ఐదు రోజుల సెలవు లభిస్తుంది. మార్చి 31 (సోమవారం) పండుగ ప్రారంభమైతే, ఈ ఉద్యోగులకు మార్చి 28 (శుక్రవారం) నుండి ఏప్రిల్ 2 (బుధవారం) వరకు ఆరు రోజుల సుదీర్ఘ వారాంతపు సెలవు లభిస్తుంది.
మరోవైపు యూఏఈలోచంద్రుని దర్శనం మార్చి 29న జరుగుతుంది. ఇస్లామిక్ నెలలు 29 లేదా 30 రోజులు ఉంటాయి. పవిత్ర రమదాన్ మాసం ముగింపును సూచిస్తూ షావాల్ 1న ఈద్ జరుపుకుంటారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







