త్వరలో యూఏఈ లో జరగనున్న మినీ ఐపీఎల్
- July 05, 2016విదేశాల్లో మినీ ఐపీఎల్ను నిర్వహించేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూఏఈ లేదా ఉత్తర అమెరికాలో ఏదో ఓచోట ఈ లీగ్ను నిర్వహిస్తారని వార్తలు వస్తున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే యూఏఈ సమయం భారత్కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ లీగ్ను జరపాలని భావిస్తున్నారు. అప్పటికి భారత జట్టు విండీస్ టూర్ ముగుస్తుంది.క్రికెట్ సలహా కమిటీ విస్తరణలో భాగంగా గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ త్వరలో హైపెర్ఫార్మెన్స్ కమిటీ (హెచ్పీసీ)గా మారే అవకాశాలున్నాయి. సెప్టెంబర్లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ఈ విషయమై చర్చించనున్నారు. హెచ్పీసీలో క్రికెట్ సలహా కమిటీయే కాకుండా సాంకేతిక కమిటీని కూడా విలీనం చేయనున్నారు. దీంట్లో ఆరుగురు సభ్యుల వరకు ఉంటారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం