పిల్లలతో భిక్షాటన..యెమెన్ జాతీయుడు అరెస్ట్..!!
- March 23, 2025
రియాద్: 8మంది పిల్లలో భిక్షాటన చేయిస్తున్న యెమెన్ జాతీయుడిని రియాద్లో అరెస్టు చేశారు. భిక్షాటనలో ఉన్నవారిపై రియాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన ప్రత్యేక ఆపరేషన్ సందర్భంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడటం ద్వారా యెమెన్ ప్రవాసియైన వ్యక్తి మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాడని కేసు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు.పిల్లలకు అవసరమైన మానవతా సేవలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి









