చైనా విద్యుత్ ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ సుంకం విధించిన ఒమన్..!!
- March 24, 2025
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వస్తువులపై అదనపు సుంకాన్ని విధించాయి.జూన్ 8 నుండి ఐదు సంవత్సరాల కాలానికి అమలులోకి వచ్చే విధంగా 1,000 వోల్ట్లకు మించని విద్యుత్ వోల్టేజ్ కలిగిన విద్యుత్ పరికరాలు, స్విచ్ల దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాయని ఒమన్ వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గల్ఫ్ సహకార మండలి దేశాలలో హానికరమైన పద్ధతులను ఎదుర్కోవడానికి సాంకేతిక సచివాలయ కార్యాలయానికి గల్ఫ్ పరిశ్రమ సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖలోని నిషేధిత పద్ధతుల విభాగం డైరెక్టర్ ఖలీద్ బిన్ ఖామిస్ అల్ మస్రూరి ధృవీకరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో హానికరమైన పద్ధతుల నుండి గల్ఫ్ ఉత్పత్తులను రక్షించడం, జాతీయ పరిశ్రమలకు న్యాయమైన పోటీ వాతావరణాన్ని నిర్ధారించడం ఈ నిర్ణయం లక్ష్యం అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆసక్తికర ట్వీట్
- సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!









