చైనా విద్యుత్ ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ సుంకం విధించిన ఒమన్..!!
- March 24, 2025
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వస్తువులపై అదనపు సుంకాన్ని విధించాయి.జూన్ 8 నుండి ఐదు సంవత్సరాల కాలానికి అమలులోకి వచ్చే విధంగా 1,000 వోల్ట్లకు మించని విద్యుత్ వోల్టేజ్ కలిగిన విద్యుత్ పరికరాలు, స్విచ్ల దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాయని ఒమన్ వాణిజ్యం, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గల్ఫ్ సహకార మండలి దేశాలలో హానికరమైన పద్ధతులను ఎదుర్కోవడానికి సాంకేతిక సచివాలయ కార్యాలయానికి గల్ఫ్ పరిశ్రమ సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖలోని నిషేధిత పద్ధతుల విభాగం డైరెక్టర్ ఖలీద్ బిన్ ఖామిస్ అల్ మస్రూరి ధృవీకరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో హానికరమైన పద్ధతుల నుండి గల్ఫ్ ఉత్పత్తులను రక్షించడం, జాతీయ పరిశ్రమలకు న్యాయమైన పోటీ వాతావరణాన్ని నిర్ధారించడం ఈ నిర్ణయం లక్ష్యం అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









