ముషీరెబ్ డౌన్టౌన్ దోహాలో 30% పెరిగిన విజిటర్స్..!!
- March 25, 2025
దోహా, ఖతార్: ముషీరెబ్ డౌన్టౌన్ దోహాలో రమదాన్ సందర్భంగా విజిటర్స్ సంఖ్య అనుహ్యంగా పెరిగింది. మార్చి 1 - 19 మధ్య, ఇది ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సందర్శకులను స్వాగతించింది. 2024తో పోలిస్తే ఇది 30% పెరుగుదల కావడం గమనార్హం.
ముషీరెబ్ ప్రాపర్టీస్లోని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ హఫీజ్ అలీ అబ్దుల్లా మాట్లాడుతూ.. ముషీరెబ్ డౌన్టౌన్ దోహాలో రమదాన్ నెల వేడుకల సందర్శకుల రాక పెరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ చుట్టుపక్కలతోపాటు వివిధ దేశాలకు చెందిన వారు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 14, 15 తేదీలలో జరిగిన గరంగో వేడుకలకు వేలాది మంది విజిటర్స్ తరలివచ్చారని తెలిపారు. ఇంకా, హోష్ ముషీరెబ్ ఒక ప్రముఖ కమ్యూనిటీ ప్లేస్ గా గుర్తింపు పొందింది. మొత్తం 12,000 మంది సందర్శకులను స్వాగతించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?







