బహ్రెయిన్‌లో మరో పబ్లిక్ చట్టం..BD300 వరకు జరిమానాలు..!!

- March 25, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో మరో పబ్లిక్ చట్టం..BD300 వరకు జరిమానాలు..!!

మనామా: బహ్రెయిన్‌లో ప్రజా పరిశుభ్రతకు సంబంధించి చట్టాలు, కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. వీటిని ఉల్లంఘించేవారికి BD 300 వరకు జరిమానాలు విధిస్తారని హెచ్చరించారు. 

పబ్లిక్ ప్రదేశాలలో ఈ క్రింది చర్యలను నిషేధించారు:

-ఏదైనా నమిలిన పదార్థాన్ని ఉమ్మివేయడం నేరం.

-సిగరెట్ పీకలు, ఇతర వ్యర్థాలను పారవేయవద్దు.

-అనధికార ప్రాంతాలలో విశ్రాంతి తీసుకోవడాన్ని నిషేధించారు.

రాజ్యం అంతటా ప్రజా పరిశుభ్రతను పెంపొందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడం ఈ చట్టం లక్ష్యమని అధికారులు తెలిపారు. నివాసితులు, సందర్శకులు అందరూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com