యూఏఈలో సైబర్ అటాక్స్.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలే టార్గెట్..!!
- March 25, 2025
యూఏఈ: జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థలు..ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలోని అనేక వ్యూహాత్మక రంగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన సైబర్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయని యూఏఈ సైబర్ భద్రతా మండలి వెల్లడించింది. సంబంధిత అధికారుల సహకారంతో అత్యవసర సైబర్ భద్రతా వ్యవస్థలు, కీలకమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని డేటా లీక్లతో సహా కీలకమైన జాతీయ వ్యవస్థలను ఉల్లంఘించే లక్ష్యంతో 634 సైబర్ దాడులను గుర్తించాయని అధికార యంత్రాంగం తెలిపింది.
యూఏఈ సైబర్ భద్రతా మండలి ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అల్ కువైట్ మాట్లాడుతూ.. థ్రెట్ యాక్టర్ "rose87168" అనే సైబర్ దాడి ఒరాకిల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ను ఛాన్నభిన్నం అయిందన్నారు. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 మిలియన్ల కస్టమర్ రికార్డులు లీక్ అయ్యాయని తెలిపారు. సున్నితమైన వినియోగదారు పాస్వర్డ్ డేటాను కలిగి ఉన్న ఈ రికార్డులు.. ప్రపంచవ్యాప్తంగా 140,000 సంస్థలను ప్రభావితం చేసిందన్నారు. ఇందులో యూఏఈలోని 634 సంస్థలు ఉన్నాయని, వీటిలో 30 ప్రభుత్వ సంస్థలు, 13 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయని వివరించారు.
సైబర్ భద్రతా మండలి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను వారి సైబర్ భద్రతా రక్షణలను బలోపేతం చేయాలని, వారి సైబర్ సంసిద్ధతను మెరుగుపరచాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









