యూఏఈలో సైబర్ అటాక్స్.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలే టార్గెట్..!!
- March 25, 2025
యూఏఈ: జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థలు..ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలోని అనేక వ్యూహాత్మక రంగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన సైబర్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయని యూఏఈ సైబర్ భద్రతా మండలి వెల్లడించింది. సంబంధిత అధికారుల సహకారంతో అత్యవసర సైబర్ భద్రతా వ్యవస్థలు, కీలకమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని డేటా లీక్లతో సహా కీలకమైన జాతీయ వ్యవస్థలను ఉల్లంఘించే లక్ష్యంతో 634 సైబర్ దాడులను గుర్తించాయని అధికార యంత్రాంగం తెలిపింది.
యూఏఈ సైబర్ భద్రతా మండలి ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అల్ కువైట్ మాట్లాడుతూ.. థ్రెట్ యాక్టర్ "rose87168" అనే సైబర్ దాడి ఒరాకిల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ను ఛాన్నభిన్నం అయిందన్నారు. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 మిలియన్ల కస్టమర్ రికార్డులు లీక్ అయ్యాయని తెలిపారు. సున్నితమైన వినియోగదారు పాస్వర్డ్ డేటాను కలిగి ఉన్న ఈ రికార్డులు.. ప్రపంచవ్యాప్తంగా 140,000 సంస్థలను ప్రభావితం చేసిందన్నారు. ఇందులో యూఏఈలోని 634 సంస్థలు ఉన్నాయని, వీటిలో 30 ప్రభుత్వ సంస్థలు, 13 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయని వివరించారు.
సైబర్ భద్రతా మండలి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను వారి సైబర్ భద్రతా రక్షణలను బలోపేతం చేయాలని, వారి సైబర్ సంసిద్ధతను మెరుగుపరచాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







