ఖతార్లో పోస్టల్ వినియోగదారుల రక్షణకు కొత్త పాలసీ..!!
- March 25, 2025
దోహా: ఖతార్ లో పోస్టల్ రంగానికి వినియోగదారుల రక్షణ విధానాన్ని కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (CRA) అమలు చేస్తుంది. ఈ మేరకు పోస్టల్ వినియోగదారుల రక్షణ కోసం నియంత్రణలను జారీ చేసింది. పోస్టల్ వినియోగదారుల హక్కులను కాపాడటంతోపాటు వారికి న్యాయమైన, పారదర్శకమైన, జవాబుదారీగా ఉండేందుకు కొత్త పాలసీ దోహదం చేస్తుందని వెల్లడించారు.
కొత్త పాలసీ అమలు ద్వారా వినియోగదారులు తమకు అందించే సేవల గురించి స్పష్టమైన, ఖచ్చితమైన, అందుబాటులో ఉండే సమాచారాన్ని పొందవచ్చు. ఇది వినియోగదారుల హక్కులకు బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. దీంతోపాటు సేవలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు మరిన్ని మార్గాలను పొందేందుకు ఇది హామీ ఇస్తుందని CRAలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ అమెల్ సలేం అల్ హనావి అన్నారు. ఈ ప్రయత్నాలు ఖతార్ పోస్టల్ సేవలపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. CRA అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వ, సమర్థవంతమైన, అధునాతన పోస్టల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్