దుబాయ్ లో Dh5కి బస్సుకు డిమాండ్.. మరో 10 ప్రదేశాలకు విస్తరణ..!!
- March 25, 2025
యూఏఈ: దుబాయ్లో సౌకర్యవంతమైన, సమర్థవంతమైన రవాణా కోసం డిమాండ్ పెరుగుతున్నది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తన బస్-ఆన్-డిమాండ్ సేవను ఎమిరేట్ అంతటా 10 కీలక ప్రదేశాలకు విస్తరించింది. వాటిలో ఔద్ మేథా, బర్షా హైట్స్ వంటి కీలక ప్రదేశాలు ఉన్నాయి. ఈ విస్తరణ ఈ అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడటంతో పాటు నివాసితులు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన రవాణా ఎంపికలను అందిస్తుందని తెలిపారు. ఒక్కొక్కరికి ప్రతి ట్రిప్కు కేవలం Dh5తో అందించే ఈ సేవ ఇప్పటికే అనేక రద్దీ ప్రాంతాలలో పనిచేస్తోంది. ఈ సర్వీస్ రోజువారీ ప్రయాణం చేసేవారికి మెరుగైన పరిష్కారాన్ని అందిస్తుంది.
"ఈ సేవ ఇప్పటికే అల్ బర్షా, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్, అల్ నహ్దా వంటి ముఖ్యమైన ప్రదేశాలలో అందుబాటులో ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో బిజినెస్ బే, డౌన్టౌన్ దుబాయ్కి విస్తరించాము" అని RTA పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షక్రీ అన్నారు. ఈ సర్వీస్ విస్తృత శ్రేణి ప్రజా రవాణా వినియోగదారుల నుండి బలమైన డిమాండ్ను ఎదుర్కొంటోందన్నారు. ప్రయాణీకులు స్మార్ట్ అప్లికేషన్ ద్వారా తమ ప్రయాణాలను బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని షక్రీ వివరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







