ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు: సీఎం రేవంత్
- March 26, 2025
హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ…ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి, నిషేధించేందుకు సిట్ వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను సైతం సవరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
రాష్ట్రంలోకి పెటుబడులు రాకుండా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ విషప్రచారం చేస్తుందంటూ విమర్శించారు.. గత కేసీఆర్ పాలనలో దిశ ఘటన జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపై నరికి హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ లో ఘటన జరిగిన వెంటనే తాము స్పందించామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. భాదితురాలికి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామన్నారు. తమ పాలనలోనే శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









