ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- March 16, 2026
ఫుజైరా: ఫుజైరా ఎమిరేట్లోని ఒక పెట్రోలియం పరిశ్రమల కేంద్రంపై డ్రోన్ దాడి జరగడం వల్ల అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫుజైరా ప్రభుత్వ మీడియా ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మరియు పరిస్థితిని త్వరితగతిన అదుపులోకి తెచ్చామని అధికారులు వెల్లడించారు.
సంఘటన జరిగిన వెంటనే అత్యవసర మరియు ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సివిల్ డిఫెన్స్ విభాగాలు మంటలు వ్యాపించకుండా సకాలంలో స్పందించి, మంటలను ఒక పరిమిత ప్రాంతానికే అరికట్టగలిగారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలు లేదా వదంతులను (Rumours) నమ్మవద్దని మరియు వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఇటువంటి సున్నితమైన విషయాల్లో కేవలం ప్రభుత్వ అధికారిక వనరుల నుండి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.
— Fujairah Media Office (@FjMediaoffice) March 16, 2026
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









