ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- March 16, 2026
విజయవాడ: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో సోమవారం ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల దురాక్రమణను అరికట్టి, వాటిని పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత 21 నెలల పాలనలో ముస్లింల సంక్షేమం కోసం అమలు చేసిన పలు పథకాలను చంద్రబాబు వివరించారు. విద్య, ఉపాధి రంగాల్లో మైనార్టీ యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









