ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- March 16, 2026
విజయవాడ: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్’లో సోమవారం ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లిం మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల దురాక్రమణను అరికట్టి, వాటిని పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత 21 నెలల పాలనలో ముస్లింల సంక్షేమం కోసం అమలు చేసిన పలు పథకాలను చంద్రబాబు వివరించారు. విద్య, ఉపాధి రంగాల్లో మైనార్టీ యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









