మయన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం..
- March 28, 2025
మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది.రికర్ట్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.
మయన్మార్ లో భారీ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు దఫాలుగా ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక థాయి లాండ్ లో ఎమర్జెన్సీ విధించారు. భూకంపం తీవ్రత అధికంగా ఉండడంతో ప్రధాని షినవ్రత.
బ్యాంకాక్ లో భారీ భూకంపం కారణంగా భవనాలు కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు మయన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. మయన్మార్ లోని మండలేలో ఉన్న ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలో కూలిపోయింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







