శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..
- March 28, 2025
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రతీరోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి. ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాలను టీటీడీ వెల్లడించింది.
ఏప్రిల్ నెలలో విశేష పర్వదినాలు..
- ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.
- ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
- ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
- ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
- ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
- ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
- ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
- ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరునక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









