జిల్లా పోలీస్ అధికారులతో తెలంగాణ డీజీపి సమీక్షా సమావేశం
- April 04, 2025
తెలంగాణ: రాబోయే వర్ష కాలంలో ఇతర రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ జిల్లా లోకి రాకుండా నియంత్రించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హై వే అథారిటీ , రవాణా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రివెంటివ్ చర్యలు చేపట్టాలని డీజీపీ డా.జితేందర్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.
ధరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనంకు శంకుస్థాపన చేసిన అనంతరం జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ హాల్ నందు శుక్రవారం డీజీపి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీసు యంత్రాంగంపై సమీక్ష జరిగింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, మరియు నేరాల పరిశీలన, ప్రజలకు అందించిన సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రజెంటేషన్ లో జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు, పోలీసు బలగాల ప్రదర్శించిన ప్రతిభలను ప్రస్తావించారుడీజీపీ.ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) లతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యమైన కేసుల వివరాలు, వాటి పురోగతి.నేరాల నివారణకు చేపట్టిన చర్యలు.శాంతి భద్రతల పరిరక్షణలో ఎదురవుతున్న సవాళ్లు.ప్రజలతో పోలీసుల సంబంధాల మెరుగుదల.ప్రతి అధికారి నుండి స్థానిక స్థాయి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలకు మార్గదర్శకాలు అందించారు.
ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ...రాబోయే వర్షాకాలంలో సరిహద్దు రాష్ట్రాల నుండి నకిలీ సీడ్స్ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి నియంత్రించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హై వే అథారిటీ, రవాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట తగిన ఏర్పాట్లు చేయించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కృషి చెయ్యాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ట్రాపిక్ నియమాల పై అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఏదైనా నేరం జరిగాక చర్యలు తీసుకునే కంటే జరుగక ముందే ముందస్తు సమాచారం తో నేరాలను ప్రివెంటివ్ చెయ్యాలని, తరచు ప్రాపర్టీ నేరాలకు పాల్పడే వారిపై రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయలని అలాగే జిల్లా లో ఉన్న రౌడి షీటర్స్ పై నిరంతర నిఘా ఉండాలనీ అన్నారు. జిల్లా లో ప్రాపర్టీ నేరాలు జరగకుండా చూడటం తో పాటు జిల్లా కు చెందినా వారు ఇతర జిల్లాల్లో నేరాలు చెయ్యకుండా చూడాలని అన్నారు.ప్రజలతో నేరుగా సంబంధాలను మెరుగుపరచడం.
నేరాల పరిశోధనను సత్వరంగా పూర్తి చేయడం.ఆధునిక టెక్నాలజీ వినియోగంతో సేవలను వేగవంతం చేయడం ద్వారా పోలీస్ శాఖను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రేమించాలని అన్నారు.పోలీస్ వెల్ఫేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్య భద్రత, ఇతర వాటిలో సమస్యలు లేకుండా చూడటం జరుగుతుందని అన్నారు.పోలీసు అధికారులకు ప్రోత్సాహం అందిస్తూ, కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలగా పని చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏం.రమేష్,
మల్టీ జోన్-II ఐజి వి.సత్యనారాయణ, జోగుళాంబ జోన్-7 DIG ఎల్.ఏస్.చౌహన్, జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు,డి.ఎస్పి శ్రీ వై మొగులయ్య, సాయుధ దళ డి.ఎస్పి శ్రీ నరేందర్ రావు, కార్యాలయ ఏ.ఒ .సతిష్ కుమార్, జిల్లా లోని సీఐ లు రవి బాబు , టంగుటూరి శ్రీను, టాటా బాబు, నాగేశ్వర్ రెడ్డి, అర్. ఐ లు, వెంకటేష్, హరీఫ్ , జిల్లా లోని అందరు ఎస్సై లు, పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష