కార్లను దొంగిలించి, పార్టులుగా విప్పి సేల్.. ముఠా అరెస్ట్..!!
- April 09, 2025
కువైట్: వాహనాలను దొంగిలించి, విడిభాగాలుగా విక్రయించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు సభ్యుల ఈజిప్షియన్ ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులను భద్రతా దళాలు ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి కార్ల విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వారు టో ట్రక్కులను ఉపయోగించి వాహనాలను సల్మి స్క్రాప్ ప్రాంతంలోని గ్యారేజీకి తరలించారని, అక్కడ వారు వాటిని విడదీసి, విడిభాగాలను విక్రయించారని.. వారి నేరాలను దాచడానికి, వారు కారు బాడీలను కూడా డెస్ట్రాయ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముఠా కార్యాక్రమాల గురించిన సమాచారం అందగానే అహ్మదీ గవర్నరేట్ దర్యాప్తు విభాగం ట్రాకింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. రెడ్ హ్యాండెండ్ గా దొంగిలించిన కార్లు, వాటి విడిభాగాలను సీజ్ చేశారు. అనుమానాస్పద ఘటనలపై సమాచారాన్ని నివేదించమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







