కార్లను దొంగిలించి, పార్టులుగా విప్పి సేల్.. ముఠా అరెస్ట్..!!
- April 09, 2025
కువైట్: వాహనాలను దొంగిలించి, విడిభాగాలుగా విక్రయించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు సభ్యుల ఈజిప్షియన్ ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులను భద్రతా దళాలు ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి కార్ల విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వారు టో ట్రక్కులను ఉపయోగించి వాహనాలను సల్మి స్క్రాప్ ప్రాంతంలోని గ్యారేజీకి తరలించారని, అక్కడ వారు వాటిని విడదీసి, విడిభాగాలను విక్రయించారని.. వారి నేరాలను దాచడానికి, వారు కారు బాడీలను కూడా డెస్ట్రాయ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముఠా కార్యాక్రమాల గురించిన సమాచారం అందగానే అహ్మదీ గవర్నరేట్ దర్యాప్తు విభాగం ట్రాకింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. రెడ్ హ్యాండెండ్ గా దొంగిలించిన కార్లు, వాటి విడిభాగాలను సీజ్ చేశారు. అనుమానాస్పద ఘటనలపై సమాచారాన్ని నివేదించమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







