కార్లను దొంగిలించి, పార్టులుగా విప్పి సేల్.. ముఠా అరెస్ట్..!!
- April 09, 2025
కువైట్: వాహనాలను దొంగిలించి, విడిభాగాలుగా విక్రయించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు సభ్యుల ఈజిప్షియన్ ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులను భద్రతా దళాలు ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి కార్ల విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వారు టో ట్రక్కులను ఉపయోగించి వాహనాలను సల్మి స్క్రాప్ ప్రాంతంలోని గ్యారేజీకి తరలించారని, అక్కడ వారు వాటిని విడదీసి, విడిభాగాలను విక్రయించారని.. వారి నేరాలను దాచడానికి, వారు కారు బాడీలను కూడా డెస్ట్రాయ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ముఠా కార్యాక్రమాల గురించిన సమాచారం అందగానే అహ్మదీ గవర్నరేట్ దర్యాప్తు విభాగం ట్రాకింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. రెడ్ హ్యాండెండ్ గా దొంగిలించిన కార్లు, వాటి విడిభాగాలను సీజ్ చేశారు. అనుమానాస్పద ఘటనలపై సమాచారాన్ని నివేదించమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







