కార్లను దొంగిలించి, పార్టులుగా విప్పి సేల్.. ముఠా అరెస్ట్..!!

- April 09, 2025 , by Maagulf
కార్లను దొంగిలించి, పార్టులుగా విప్పి సేల్.. ముఠా అరెస్ట్..!!

కువైట్: వాహనాలను దొంగిలించి, విడిభాగాలుగా విక్రయించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు సభ్యుల ఈజిప్షియన్ ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులను భద్రతా దళాలు ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి కార్ల విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. వారు టో ట్రక్కులను ఉపయోగించి వాహనాలను సల్మి స్క్రాప్ ప్రాంతంలోని గ్యారేజీకి తరలించారని, అక్కడ వారు వాటిని విడదీసి, విడిభాగాలను విక్రయించారని.. వారి నేరాలను దాచడానికి, వారు కారు బాడీలను కూడా డెస్ట్రాయ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముఠా కార్యాక్రమాల గురించిన సమాచారం అందగానే అహ్మదీ గవర్నరేట్ దర్యాప్తు విభాగం ట్రాకింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. రెడ్ హ్యాండెండ్ గా దొంగిలించిన కార్లు, వాటి విడిభాగాలను సీజ్ చేశారు. అనుమానాస్పద ఘటనలపై సమాచారాన్ని నివేదించమని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com