BD1 ఛార్జీల విషయంలో గొడవ.. డ్రైవర్ ఘాతుకం.. మహిళ మృతి..!!
- April 10, 2025
మనామా: BD1 ఛార్జీల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఓ మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. కదులుతున్న కారు తలుపును గట్టిగా పట్టుకోవడంతో, కారు ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రిల్లో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అరబ్ వ్యక్తి అయిన డ్రైవర్కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతని శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించబడతాడు.
ఈ సంఘటన గత సంవత్సరం డిసెంబర్ 6 తెల్లవారుజామున జరిగింది.ఆ మహిళ , మరో ఇద్దరు తెల్లవారుజామున 2 గంటల వరకు ఒక హోటల్లో ఉన్నారు. BD3 మాట్లాడుకొని కారులో వచ్చారు. కానీ దూరం తక్కువగా ఉందని మహిళల్లో ఒకరు వాదించి BD2 ఇచ్చారు. గొడవ జరిగింది. కాగా, వివాదం సమయంలో ఆ వ్యక్తి మహిళలను అవమానించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిలో మృతురాలు కారు తలుపు పట్టుకోకువంది. ఆపడానికి బదులుగా, డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మహిళ పట్టు కోల్పోయి, కిందపడి, తీవ్రంగా గాయపడ్డది. ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ నాలుగు రోజుల తర్వాత తలకు గాయాలు , ఎముకలు విరిగిపోవడంతో మరణించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









