ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- February 25, 2026
హైదరాబాద్: అడోబ్ (Adobe) సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధి మరియు సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ రంగంపై చూపుతున్న ప్రభావం గురించి శంతను నారాయణ్ మరియు ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. తెలంగాణను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్లోబల్ ట్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ ,కొత్త పారిశ్రామిక అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









