కువైట్ లో దంచికొడుతున్న ఎండలు..!!
- April 11, 2025
కువైట్: కువైట్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. వేడి గాలుల కారణంగా క్రమంగా ఉష్ణోగ్రతలు 41 -42 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దుమ్ము కారణంగా హారిజంటల్ విజిబిలిటీ తగ్గుతుందని అల్-అలీ హెచ్చరించారు. మరోవైపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని, కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు 6 అడుగులకు చేరే అవకాశం ఉందన్నారు. తాజా వాతావరణ సమాచారం, హెచ్చరికల కోసం వాతావరణ శాఖ తన అధికారిక వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అప్డేట్ లను తెలుసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!