బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- February 27, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం) రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్ లో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. బొత్స ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరికొన్ని రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







