బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్‌

- February 27, 2026 , by Maagulf
బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ (మెదడుకు రక్తప్రసరణలో ఆటంకం) రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. బొత్స ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరికొన్ని రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com