ఖతార్ లో పర్యావరణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- April 11, 2025
దోహా: ఖతార్ పర్యావరణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తుంది. అల్ కరానాకు దక్షిణంగా ఉన్న “అల్-సబ్సెబ్” మేడో వద్ద పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతను తన వాహనంతో గడ్డి మైదానంలోకి ప్రవేశించడం, గడ్డి మైదాన కంచెను ధ్వంసం చేయడం, పక్షులను ఆకర్షించే విజిల్ ఉపయోగించడం వంటి అనేక పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని పేర్కొంది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించే నైతిక విధి అని వివరించింది. పౌరులు, నివాసితులు నిబంధనలను పాటించాలని, సంబంధిత అధికారులకు సహకరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









