ఖతార్ లో పర్యావరణ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- April 11, 2025
దోహా: ఖతార్ పర్యావరణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తుంది. అల్ కరానాకు దక్షిణంగా ఉన్న “అల్-సబ్సెబ్” మేడో వద్ద పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతను తన వాహనంతో గడ్డి మైదానంలోకి ప్రవేశించడం, గడ్డి మైదాన కంచెను ధ్వంసం చేయడం, పక్షులను ఆకర్షించే విజిల్ ఉపయోగించడం వంటి అనేక పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని పేర్కొంది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించే నైతిక విధి అని వివరించింది. పౌరులు, నివాసితులు నిబంధనలను పాటించాలని, సంబంధిత అధికారులకు సహకరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







