ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- March 01, 2026
అమెరికా: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ గనుక సాహసించి దాడులు కొనసాగిస్తే, ఆ దేశం “చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని” భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విమాన వాహక నౌకలు ఇప్పటికే మధ్యధరా సముద్రంలో మోహరించాయి.
ఖమేనీ మరణానికి ప్రతీకారంగా భారీ ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో స్పందించారు. ‘‘ఇరాన్ ఈరోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతోంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు గనుక సాహసిస్తే, మేము వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









