ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- March 01, 2026
అమెరికా: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ గనుక సాహసించి దాడులు కొనసాగిస్తే, ఆ దేశం “చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చూడని” భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విమాన వాహక నౌకలు ఇప్పటికే మధ్యధరా సముద్రంలో మోహరించాయి.
ఖమేనీ మరణానికి ప్రతీకారంగా భారీ ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో స్పందించారు. ‘‘ఇరాన్ ఈరోజు మునుపెన్నడూ లేనంత గట్టిగా కొడతామని చెబుతోంది. వారు ఆ పని చేయకపోవడమే మంచిది. ఒకవేళ వారు గనుక సాహసిస్తే, మేము వారిపై ప్రయోగించే శక్తి ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









