ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- March 01, 2026
యూఏఈ: ఎయిర్స్పేస్ మూసివేతల కారణంగా ఎమిరేట్స్ మార్చి 1 వరకు దుబాయ్కు వచ్చే మరియు బయలుదేరే అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. రాబోయే 72 గంటల్లో ప్రయాణించడానికి బుక్ చేసుకుంటే, ప్రత్యామ్నాయ విమానంలో రీబుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రయాణ తేదీ నుండి 10 రోజుల వరకు మీరు వెళ్లాల్సిన గమ్యస్థానానికి మరొక విమానంలో రీబుక్ చేసుకోవచ్చని తెలిపారు. మీరు ట్రావెల్ ఏజెంట్తో మీ విమానాన్ని బుక్ చేసుకుంటే, వెంటనే వారిని సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలని ఎమిరేట్స్ అధికారులు సూచించారు.
ఎమిరేట్స్ వద్ద నేరుగా బుక్ చేసుకుంటే, రీఫండ్ కోసం దరఖాస్తు చేయాలన్నారు. మీరు ట్రావెల్ ఏజెంట్ ద్వారా విమానాలను బుక్ చేసుకుంటే, వారినే సంప్రదించాలని కోరారు. విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేయాలని కోరారు. విమాన రద్దుల వల్ల ప్రభావితమైన కస్టమర్లు రీబుకింగ్ కోసం వారి ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించాలి. తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్నది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









