కొత్త పాలసీ..ఇకపై ఎమిరాటీలు మాత్రమే మీడియాతో మాట్లాడగలరు..!!
- April 17, 2025
యూఏఈః కొత్త విధానం ప్రకారం యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెల్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతి ఉందని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పష్టం చేసింది. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి, సంబంధిత అధికారులు కొన్ని సంస్థలు చేసిన ఉల్లంఘనలను నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. కొన్ని మీడియా ప్రాతినిధ్యాలలో "ఎమిరాటీ మాండలికం,సాంస్కృతిక చిహ్నాల వక్రీకరణ" తర్వాత ఈ విధానాన్ని అమలు చేశారు. ఎమిరాటీలు యూఏఈకి చెందిన ప్రత్యేకమైన మాండలికంతో అరబిక్ మాట్లాడతారు. కొత్త విధానం ఎమిరాటీ సంస్కృతి, గుర్తింపు ప్రామాణికతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుందని FNCలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యురాలు నయీమా అల్ షర్హాన్ తెలిపారు. వేగవంతమైన సాంస్కృతిక మార్పులు, మీడియా ప్లాట్ఫారమ్ల విస్తరణ వల్ల ఎదురయ్యే సవాళ్లను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఎమిరాటీ మాండలికం , స్థానిక సాంస్కృతిక చిహ్నాలు రోజువారీ మార్కెటింగ్, వినోదంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ, వాటి ప్రదర్శనలో వక్రీకరణలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









