కొత్త పాలసీ..ఇకపై ఎమిరాటీలు మాత్రమే మీడియాతో మాట్లాడగలరు..!!
- April 17, 2025
యూఏఈః కొత్త విధానం ప్రకారం యూఏఈ పౌరులు మాత్రమే మీడియా ఛానెల్లలో ఎమిరాటీ మాండలికంలో మాట్లాడటానికి అనుమతి ఉందని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పష్టం చేసింది. ఈ విధానం అమలులోకి వచ్చినప్పటి నుండి, సంబంధిత అధికారులు కొన్ని సంస్థలు చేసిన ఉల్లంఘనలను నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. కొన్ని మీడియా ప్రాతినిధ్యాలలో "ఎమిరాటీ మాండలికం,సాంస్కృతిక చిహ్నాల వక్రీకరణ" తర్వాత ఈ విధానాన్ని అమలు చేశారు. ఎమిరాటీలు యూఏఈకి చెందిన ప్రత్యేకమైన మాండలికంతో అరబిక్ మాట్లాడతారు. కొత్త విధానం ఎమిరాటీ సంస్కృతి, గుర్తింపు ప్రామాణికతను కాపాడటం లక్ష్యంగా పెట్టుకుందని FNCలో జరిగిన చర్చ సందర్భంగా సభ్యురాలు నయీమా అల్ షర్హాన్ తెలిపారు. వేగవంతమైన సాంస్కృతిక మార్పులు, మీడియా ప్లాట్ఫారమ్ల విస్తరణ వల్ల ఎదురయ్యే సవాళ్లను ఈ సందర్భంగా హైలైట్ చేశారు. ఎమిరాటీ మాండలికం , స్థానిక సాంస్కృతిక చిహ్నాలు రోజువారీ మార్కెటింగ్, వినోదంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నప్పటికీ, వాటి ప్రదర్శనలో వక్రీకరణలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







