శ్రీనగర్ కాల్పుల్లో యువ జవాను మృతి
- July 07, 2016
శ్రీనగర్లో జరిగిన కాల్పుల్లో వెంకటకృష్ణ(25) అనే యువ జవాను మృతి చెందాడు. ఇతని స్వస్థలం కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం. గురువారం తెల్లవారుజామున పై అధికారితో తలెత్తిన విభేదాల కారణంగా ఇద్దరు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో వెంకటకృష్ణ తీవ్రంగా గాయపడి చనిపోయాడు.సదరు పై అధికారి కూడా తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కాగా వెంకటకృష్ణ అవివాహితుడు. తండ్రి ఇడిగ పెద్ద వెంకటన్న కొన్నేళ్ల క్రితమే చనిపోగా గ్రామంలో అతని తల్లి, ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వెంకటకృష్ణ మృతదేహం ఈనెల 8వ తేదీన స్వగ్రామం చేరుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







