ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఐసిస్ సానుభూతిపరులతో కుటుంబసభ్యులు
- July 07, 2016
నగరంలో దాడులకు కుట్ర పన్ని పట్టుబడ్డ ఐసిస్ సానుభూతిపరులకు.. రంజాన్ సందర్భంగా వారి కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు. నాంపల్లి కోర్టు అనుమతితో ప్రస్తుతం ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. రంజాన్ సందర్భంగా గురువారం విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. యువకులకు చెందిన కుటుంబసభ్యులు ఇద్దరేసి వంతున కలిసేందుకు అనుమతి ఇచ్చారు. రంజాన్ కావడంతో ఆ యువకుల మనోభావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అయితే కుటుంబసభ్యులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను మాత్రం అనుమతించలేదు. యువకులు కోరిన ఆహార పదార్ధాలను తామే తయారుచేయించినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి వారి విచారణ యథాతథంగా జరుగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







