షార్జాలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన స్కేల్..!!
- April 18, 2025
యూఏఈ: షార్జా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొత్త జీతం స్కేల్ను షార్జా పాలకుడు ఆమోదించారు. అలాగే ప్రతి ఉద్యోగ గ్రేడ్లో ప్రామాణిక నాలుగు సంవత్సరాల పదవీకాలంతో పాటు 'స్పెషల్ ఎ', 'స్పెషల్ బి' అనే రెండు కొత్త ఉద్యోగ గ్రేడ్లను కొత్తగా నమోదు చేయనున్నారు. కొత్త జీతం స్కేల్ ఉద్యోగ భద్రతను పెంచుతుందని, ప్రభుత్వ రంగంలోని ఎమిరాటీ పౌరులకు కెరీర్ పురోగతికి స్పష్టమైన మార్గాలను అందిస్తుందని భావిస్తున్నారు. షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమిరాటీ ఇంజనీర్ల కోసం ప్రత్యేకంగా సవరించిన జీతం స్కేల్ను కూడా ఆమోదించారు. ఇందులో కొత్త 'స్పెషల్' గ్రేడ్ పరిచయం చేశారు. జీతం స్కేల్ ఇంజనీరింగ్ స్థానాలకు ప్రతి ఉద్యోగ స్థాయిలో నాలుగు సంవత్సరాల వ్యవధిని కూడా నిర్దేశిస్తుంది.
షార్జాలోని మానవ వనరుల విభాగాధిపతి అబ్దుల్లా ఇబ్రహీం అల్ జాబి మాట్లాడుతూ.. "సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకున్న తర్వాత షార్జా ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రొఫెషనల్ ఇంజనీర్లకు జీతాల స్కేళ్లకు సంబంధించి షార్జా పాలకుడి ఆదేశాలను అమలు చేయడం ప్రారంభిస్తాము. ఈ ఆదేశాలను అభినందిస్తూ షార్జా ప్రభుత్వ ఉద్యోగులు మరింత కృషి, అంకితభావంతో పనిచేయాలని మేము కోరుతున్నాము." అని అభిప్రాపడ్డారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







